పాట - 1
పల్లవి :
నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో... ఏ పూల పూజింతునో
చరణం : 1
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె
శ్రీ పారిజాత సుమాలెన్నో పూచె
ఈ పేదరాలి మనస్సెంతో వేచె
నీ పాద సేవా మహాభాగ్యమీవా
నా పైని దయజూపవా... నా స్వామి
నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో... ఏ పూల పూజింతునో
చరణం : 2
దూరాననైన కనే భాగ్యమీవా
నీ రూపు నాలో సదా నిల్వనీవా
ఏడుకొండలపైనా వీడైన స్వామి
నా పైని దయజూపవా.. నా స్వామి
నీవుండేదా కొండపై నా స్వామి
నేనుండేదీ నేలపై
ఏ లీల సేవింతునో... ఏ పూల పూజింతునో
చిత్రం : భాగ్యరేఖ (1957)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : పి.సుశీల
No comments:
Post a Comment